ఇ-ఎన్వలప్‌పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ

- August 28, 2020 , by Maagulf
ఇ-ఎన్వలప్‌పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ

కువైట్: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ), కొత్త సర్వీసుల్ని ఎలక్ట్రానిక్‌ ఎన్వలప్‌ ప్లాట్‌ఫాంపై ప్రారంభించింది. పౌరులు అలాగే రెసిడెంట్స్‌కి మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త సర్వీసుల్లో న్యూ బోర్న్‌ చిన్నారుల ఫస్ట్‌ టైమ్ రిజిస్ట్రేషన్‌, కుటుంబ సభ్యుల ఫస్ట్‌ టైమ్ రిజిస్ట్రేషన్‌, డొమెస్టిక్‌ సర్వెంట్‌ వంటివి వుంటాయి. కాగా, 200,000కి పైగా ఐడీ కార్డుల్ని పిఎసిఐ డెలివరీ ప్రక్రియను పూర్తి చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెన్యువల్‌ చేసిన సివిల్‌ ఐడీలను పంపిణీ చేశారు. పిఎసిఐ, మే నెలకు సంబంధించిన కార్డుల డిస్ట్రిబ్యూషన్‌ ప్రక్రియ చేపడుతోంది. విజిటర్స్‌, ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లేకుండానే (మెషీన్‌ నెంబర్‌ కలిగి వుంటే) వీటిని పొందవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com