షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- August 28, 2020
షార్జా: ఓ ట్రక్, మరో రెండు వాహనాల్ని ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అల్ ధయిద్, షార్జా రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు మరియు ఆరు ఇంటర్ఛేంజ్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.20 నిమిషాల సమయంలో షార్జా పోలీస్ ఆపరేషన్ రూమ్ కి ఈ ఘటనపై తొలుత సమాచారం అందింది. వెంటనే ఎమర్జన్సీ క్రూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఓ ట్రక్ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాల్ని క్లియర్ చేసి, ట్రాఫిక్కి అనుమతించారు. వాహనదారులు వాహనాల టైర్ల పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







