షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- August 28, 2020
షార్జా: ఓ ట్రక్, మరో రెండు వాహనాల్ని ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అల్ ధయిద్, షార్జా రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు మరియు ఆరు ఇంటర్ఛేంజ్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.20 నిమిషాల సమయంలో షార్జా పోలీస్ ఆపరేషన్ రూమ్ కి ఈ ఘటనపై తొలుత సమాచారం అందింది. వెంటనే ఎమర్జన్సీ క్రూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఓ ట్రక్ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాల్ని క్లియర్ చేసి, ట్రాఫిక్కి అనుమతించారు. వాహనదారులు వాహనాల టైర్ల పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







