దుబాయ్ నుంచి ఎట్టకేలకు స్వదేశానికి చేరిన తెలంగాణ వాసి...
- August 28, 2020
దుబాయ్:5 ఏళ్ళ క్రితం ఓ యువకుడు దొంగచాటుగా ఒమన్ దేశ సరిహద్దులు దాటి దుబాయ్ వెళ్లాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన జంగిలి పెద్దులు ఈ నెల 27న గురువారం దుబాయ్ నుండి ముంబై ద్వారా హైదరాబాద్ చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే...జంగిలి పెద్దులుకొందరి మాటలు నమ్మి, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనా మూలంగా అందరూ స్వదేశాలకు వెళ్తుండగా, పెద్దులు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాగా పెద్దులు సమస్య తెలిసిన దుబాయ్ కాన్సులేట్ అధికారులు పెద్దులుకు తాత్కాలిక పాస్ పోర్టు ఇప్పించారు.
అంతేగాకుండా అక్కడ పెద్దులుకు జైత నారాయణ(సోషల్ వర్కర్) సహకరించారు. భారతీయ పౌరుడు అని నిరూపించే పత్రాలను భారత్ నుంచి ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి పంపించారు. కరోనా నేపథ్యంలో ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం ద్వారా ఇండియాకు చేరాడు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న జంగిలి పెద్దులు మాట్లాడుతూ… మెరుగైన ఉద్యోగ అవకాశాలుంటాయన్న మాటలు నమ్మి అక్రమంగా దేశ సరిహద్దులు దాటడం తాను చేసిన పొరపాటని, ఈ విధంగా ఎవరూ చేయకూడదని అన్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







