దుబాయ్ నుంచి ఎట్టకేలకు స్వదేశానికి చేరిన తెలంగాణ వాసి...

- August 28, 2020 , by Maagulf
దుబాయ్ నుంచి ఎట్టకేలకు స్వదేశానికి చేరిన తెలంగాణ వాసి...

దుబాయ్:5 ఏళ్ళ క్రితం ఓ యువకుడు దొంగచాటుగా ఒమన్ దేశ సరిహద్దులు దాటి దుబాయ్ వెళ్లాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన జంగిలి పెద్దులు ఈ నెల 27న గురువారం దుబాయ్ నుండి ముంబై ద్వారా హైదరాబాద్ చేరుకున్నాడు. 

వివరాల్లోకి వెళ్తే...జంగిలి పెద్దులుకొందరి మాటలు నమ్మి, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనా మూలంగా అందరూ స్వదేశాలకు వెళ్తుండగా, పెద్దులు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాగా పెద్దులు సమస్య తెలిసిన దుబాయ్ కాన్సులేట్ అధికారులు పెద్దులుకు తాత్కాలిక పాస్ పోర్టు ఇప్పించారు.

అంతేగాకుండా అక్కడ పెద్దులుకు జైత నారాయణ(సోషల్ వర్కర్) సహకరించారు. భారతీయ పౌరుడు అని నిరూపించే పత్రాలను భారత్ నుంచి ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి పంపించారు. కరోనా నేపథ్యంలో ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం ద్వారా ఇండియాకు చేరాడు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న జంగిలి  పెద్దులు మాట్లాడుతూ… మెరుగైన ఉద్యోగ అవకాశాలుంటాయన్న మాటలు నమ్మి అక్రమంగా దేశ సరిహద్దులు దాటడం తాను చేసిన పొరపాటని, ఈ విధంగా ఎవరూ చేయకూడదని అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com