యూఏఈ తో భారత్ మిస్సైల్ వ్యాపారం..వర్కౌట్ అవుతుందా?
- August 29, 2020
న్యూఢిల్లీ: అరబ్ దేశాలు క్రూడ్ ఆయిల్ సంపాదనతో విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటాయి. కానీ.. వారి రక్షణ కోసం సొంతంగా ఆయుధాలను తయారుచేసే నైపుణ్యత వారికి లేదు. అందుకే అమెరికా, రష్యా నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తుంటాయి. అయితే భారతదేశం కూడా ఇటీవలే ఆయుధ మార్కెట్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్ తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మాలని నిర్ణయించింది. దీంతో వీటి కోసం ఇప్పటికే 5.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లు వచ్చాయి. తాజాగా దుబాయ్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను తమకు అమ్మాలని భారత్ను కోరుతుంది. నిజానికి దుబాయ్ భారత్కు మిత్రదేశం అయినప్పటికి అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉండడం వల్ల వీటిని అమ్మలా.. వద్దా.. అని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మితే పొరపాటున అవి ఉగ్రవాదుల చేతికి చిక్కి.. వారు ఇతర దేశాలపైకి ప్రయోగిస్తే దుబాయ్ సైన్యం నుండి ఉగ్రవాదులకు చేరాయి కాబట్టి ఉగ్రవాదులు దాడి చేసినప్పటికీ దుబాయ్ దాడి చేసినట్లుగా భావిస్తారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మాకంపై తీవ్రంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ రష్యాను భారత్ బ్రహ్మోస్ అమ్మేందుకు రికమండేషన్ చేయాలని కోరింది. భారత ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి...!!
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!