దలైలామా భద్రతపై నిఘా పెంచిన భారత్
- August 29, 2020
దలైలామాకి భద్రతను మరింత పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిబెట్ను చైనా అక్రమించడంతో అక్కడ వుండే బౌద్ద గురువు దలైలామా భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దలైలామా భారత్లో ఉండడంతో టిబెట్ ఎప్పటికైనా చైనా నుండి విడుదల అవుతుందనే ఒక అశ టిబెట్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. మరోవైపు చైనా అమెరికాతో కూడా యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా ఆక్రమించిన టిబెట్నీ ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు పావులు కదుపుతోంది. అమెరికా కనుక టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే దాని మిత్ర దేశాలు కూడా అలాగే చేస్తాయి. అదే జరిగితే దలైలామా కీలకం అవుతారు. అందుకే దలైలామా పై చైనా నిఘా పెట్టింది. .
ఇటీవలే భారత్లో చైనా గూడచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దలైలామాకు దగ్గరగా ఉంటూ ఆయన భద్రతకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు చైనాకు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. దలైలామాకు హాని తలపెట్టెందుకు చైనా ప్రయత్నిస్తుందనే సమాచారం వచ్చింది. దలైలామా భారత్ను రక్షణ కోరి వచ్చారు. కాబట్టి ఆయనకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత భారత్ వహించాల్సీంటుంది. అందుకే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించింది...!!
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







