దలైలామా భద్రతపై నిఘా పెంచిన భారత్
- August 29, 2020
దలైలామాకి భద్రతను మరింత పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిబెట్ను చైనా అక్రమించడంతో అక్కడ వుండే బౌద్ద గురువు దలైలామా భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దలైలామా భారత్లో ఉండడంతో టిబెట్ ఎప్పటికైనా చైనా నుండి విడుదల అవుతుందనే ఒక అశ టిబెట్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. మరోవైపు చైనా అమెరికాతో కూడా యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా ఆక్రమించిన టిబెట్నీ ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు పావులు కదుపుతోంది. అమెరికా కనుక టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే దాని మిత్ర దేశాలు కూడా అలాగే చేస్తాయి. అదే జరిగితే దలైలామా కీలకం అవుతారు. అందుకే దలైలామా పై చైనా నిఘా పెట్టింది. .
ఇటీవలే భారత్లో చైనా గూడచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దలైలామాకు దగ్గరగా ఉంటూ ఆయన భద్రతకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు చైనాకు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. దలైలామాకు హాని తలపెట్టెందుకు చైనా ప్రయత్నిస్తుందనే సమాచారం వచ్చింది. దలైలామా భారత్ను రక్షణ కోరి వచ్చారు. కాబట్టి ఆయనకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత భారత్ వహించాల్సీంటుంది. అందుకే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించింది...!!
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







