బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి
- August 29, 2020
మనామా:కరోనా మహమ్మారి ధాటికి బహ్రెయిన్ లో మరొకరు మృతి చెందారు. 59 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. నిన్నటి వరకు కరోనా కారణంగా 189 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్ లో వైరస్ బారిన పడిన 65 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..357 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇందులో 115 మంది ప్రవాసీయులు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 88 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







