బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి
- August 29, 2020
మనామా:కరోనా మహమ్మారి ధాటికి బహ్రెయిన్ లో మరొకరు మృతి చెందారు. 59 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. నిన్నటి వరకు కరోనా కారణంగా 189 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్ లో వైరస్ బారిన పడిన 65 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..357 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇందులో 115 మంది ప్రవాసీయులు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 88 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









