బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి

- August 29, 2020 , by Maagulf
బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి

మనామా:కరోనా మహమ్మారి ధాటికి బహ్రెయిన్ లో మరొకరు మృతి చెందారు. 59 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. నిన్నటి వరకు కరోనా కారణంగా 189 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్ లో వైరస్ బారిన పడిన 65 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..357 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇందులో 115 మంది ప్రవాసీయులు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 88 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 మంది వైరస్ బారిన పడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com