బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి
- August 29, 2020మనామా:కరోనా మహమ్మారి ధాటికి బహ్రెయిన్ లో మరొకరు మృతి చెందారు. 59 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. నిన్నటి వరకు కరోనా కారణంగా 189 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్ లో వైరస్ బారిన పడిన 65 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..357 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇందులో 115 మంది ప్రవాసీయులు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 88 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం