భారత్ లో కరోనా కల్లోలం..

- August 30, 2020 , by Maagulf
భారత్ లో కరోనా కల్లోలం..

న్యూ ఢిల్లీ:భారత్ లో గడిచిన 24 గంటల్లో ఏకంగా 79 వేల కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదో రికార్డు. జులై 25న అమెరికాలో ఒక్కరోజులో 78 వేల 427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78 వేల 903 కేసులు వచ్చాయి. USలో 76 వేలకుపైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా.. ఈ వారం రోజుల నుంచే భారత్‌లో కరోనా మీటర్ మరింత పైపైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4 లక్షల 96 వేల మంది అంటే దాదాపుగా 5 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70 వేల 867 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com