విడుదలకు సిద్ధమవుతున్న'కళ్యాణ వైభోగమే
- February 09, 2016
నాగశౌర్య, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నందిని రెడ్డి దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఆడియో వేడుక నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ను మా చిత్రం తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను 'అభిషేక్ పిక్చర్స్' సంస్థ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ఈ సంస్థ మా సినిమా విడుదల హక్కులను కూడా దక్కించు కోవడం విశేషం. ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్ళిలాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ చక్కగా అర్ధ మయ్యేలా రూపొందించిన చిత్రమిది.సున్నితమైన భావోద్వేగాలకు వినోదం, సంగీతాన్ని సరైన పాళ్ళలో మేళవించి తెరకెక్కించిన కుటుంబ కథా చిత్ర మిది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెలాఖరులోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధన్రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జి.వి.ఎస్.రాజు, ఎడిటర్: జునైద్ సిద్ధిక్.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







