తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- September 04, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో మరో 2,478 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 866 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,011 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి కావడంతో.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,02,024 కి చేరింది. ప్రస్తుతం 32,994 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

--హరి (మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com