సౌదీ:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేసిన కేసులో 9 మంది ప్రవాసీయుల అరెస్ట్
- September 06, 2020
రియాద్:విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేస్తున్న 9 మంది ప్రవాసీయులను సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ తమ సౌదీకి చెందిన వ్యక్తులుగా తప్పుడు వివరాలతో వ్యక్తిగత బిజినెస్ అకౌంట్లను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మనీ ఎక్సేంజ్ చేయటం ద్వారా కమిషన్లు తీసుకుంటూ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టైన ప్రవాసీయుల్లో ముగ్గురు సిరియన్లు, ముగ్గురు ఈజిప్టియన్లు, ఒకరు యెమన్ జాతీయుడు, ఒక పాకిస్తానీ, ఒక తుర్కిష్ జాతీయుడు ఉన్నట్లు నిందితుల వివరాలను పోలీసులు వివరించారు. నిందితుల నుంచి ఒక మిలియన్ రియాల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో వారిని తర్వాతి న్యాయ విచారణకు సిఫార్సు చేశామన్నారు. ఇదిలాఉంటే..గత నెలలో ఇదే తరహాలో విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముఠా 500 మిలియన్ రియాల్స్ ను విదేశాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







