యూఏఈ:వీసా గడువు ముగిసిన వారికి ముంచుకొస్తున్న డెడ్ లైన్..మరో 4 రోజులే గడువు
- September 07, 2020
యూఏఈ:మార్చి 1తో యూఏఈ విజిట్, టూరిస్ట్ వీసాల గడువు ముగిసిన వారికి హెచ్చరిక.! ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లేందుకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. యూఏఈ పౌర గుర్తింపు ఫెడరల్ అధికార విభాగం తాజాగా జారీ చేసిన ప్రకటన మేరకు విజిట్, టూరిస్ట్ వీసా గడువు ముగిసన వారు సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి కరోనా మహమ్మారి పరిస్థితులతో విమాన సర్వీసులు రద్దవటం కారణంగా వీసా గడువును వచ్చే డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత అన్ లాక్ ప్రక్రియతో పరిస్థితులు కొద్దిమేర మెరుగుపడటం..ప్రత్యేక విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో డిసెంబర్ వరకు వీసాల పొడగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది యూఏఈ. అయితే..విజిట్, టూరిస్ట్ వీసాదారులకు మరో వెసులుబాటు కలిపించేలా ఆగస్ట్ 11 నుంచి నెల రోజుల పాటు అవకాశం ఇచ్చింది. ఈ నెల రోజుల వ్యవధిలో వీసా గడువు ముగిసిన వారు దేశం విడిచి వెళ్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు..తిరిగి యూఏఈ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వీసా గడువు ముగిసినా సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లకుంటే జరిమానా చెల్లించాల్సిందేనని యూఏఈ స్పష్టం చేసింది. వీసా గడువు దాటిన తర్వాత తొలి రోజున Dh200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి రోజుకు Dh100 జరిమానా చెల్లించాలి. దీనికితోడు Dh100 సర్వీస్ చార్జ్ అదనంగా చెల్లించాలి. ఇదిలాఉంటే..వీసా గడువు ముగిసినా..యూఏఈలోనే ఉండాల్సి వచ్చిన వారు తమ వీసాలను సెప్టెంబర్ 11 నాటికి రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన