యూఏఈ:వీసా గడువు ముగిసిన వారికి ముంచుకొస్తున్న డెడ్ లైన్..మరో 4 రోజులే గడువు
- September 07, 2020
యూఏఈ:మార్చి 1తో యూఏఈ విజిట్, టూరిస్ట్ వీసాల గడువు ముగిసిన వారికి హెచ్చరిక.! ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లేందుకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. యూఏఈ పౌర గుర్తింపు ఫెడరల్ అధికార విభాగం తాజాగా జారీ చేసిన ప్రకటన మేరకు విజిట్, టూరిస్ట్ వీసా గడువు ముగిసన వారు సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి కరోనా మహమ్మారి పరిస్థితులతో విమాన సర్వీసులు రద్దవటం కారణంగా వీసా గడువును వచ్చే డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత అన్ లాక్ ప్రక్రియతో పరిస్థితులు కొద్దిమేర మెరుగుపడటం..ప్రత్యేక విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో డిసెంబర్ వరకు వీసాల పొడగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది యూఏఈ. అయితే..విజిట్, టూరిస్ట్ వీసాదారులకు మరో వెసులుబాటు కలిపించేలా ఆగస్ట్ 11 నుంచి నెల రోజుల పాటు అవకాశం ఇచ్చింది. ఈ నెల రోజుల వ్యవధిలో వీసా గడువు ముగిసిన వారు దేశం విడిచి వెళ్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు..తిరిగి యూఏఈ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వీసా గడువు ముగిసినా సెప్టెంబర్ 11 నాటికి దేశం విడిచి వెళ్లకుంటే జరిమానా చెల్లించాల్సిందేనని యూఏఈ స్పష్టం చేసింది. వీసా గడువు దాటిన తర్వాత తొలి రోజున Dh200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి రోజుకు Dh100 జరిమానా చెల్లించాలి. దీనికితోడు Dh100 సర్వీస్ చార్జ్ అదనంగా చెల్లించాలి. ఇదిలాఉంటే..వీసా గడువు ముగిసినా..యూఏఈలోనే ఉండాల్సి వచ్చిన వారు తమ వీసాలను సెప్టెంబర్ 11 నాటికి రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రకటించింది.

తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా









