ఏపీలో ఆగని కరోనా విజృంభణ
- September 08, 2020
అమరావతి:ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,993 శాంపిల్స్ ని పరీక్షించగా 10,601 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల గుంటూరు లో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, చితూర్ లో ఎనిమిది మంది, కడప లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, నెలూరు లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,691 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5,14,199 పాజిటివ్ కేసు లకు గాను 4,12,870 మంది డిశ్చార్జ్ కాగా.. 4,560 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,769 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









