యూఏఈ:190 దిర్హామ్ లకు ఇంటి దగ్గరే కోవిడ్ టెస్ట్..ప్రకటించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్
- September 09, 2020
యూఏఈ నుంచి ఇండియా వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కోవిడ్ 19 టెస్ట్ ప్యాకేజ్ ప్రకటించింది. ప్రయాణికులు కోరితే వారి ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఎన్ఎంసీ హెల్త్ కేర్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్. యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికులు కోరితే...190 దిర్హామ్ లకే ఇంటిదగ్గర కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటి దగ్గర చేయించుకునేందుకు సుముఖంగా లేని వ్యక్తులు యూఏఈ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎంసీ హెల్త్ కేర్ క్లినిక్స్ లో టెస్టులు చేయించుకోవచ్చని..ఇందుకు 150 దిర్హామ్ లు ఛార్జ్ చేస్తారని వివరించింది. ఎన్ఎంసీ హెల్త్ కేర్ క్లినిక్స్ అబుధాబిలో 11, దుబాయ్ లో 4, షార్జాలో 8, రస్ ఆల్ ఖైమాలో ఒకటి ఉన్నాయి. ఇదిలాఉంటే..యూఏఈ నుంచి భారత్ వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేకున్నా..తప్పనిసరిగా చేయించుకుంటే మంచిదని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అలాగే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వెళ్లే వారు మాత్రం ఖచ్చితంగా విమానం ఎక్కే 96 గంటల్లో పరీక్ష చేసుకున్నట్లు కోవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







