మస్కట్: నవంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, స్థానిక పునరావాస కేంద్రాలకు అనుమతి
- September 10, 2020
మస్కట్:ఒమన్ లోని అన్ని గవర్నరేట్ల పరిధిలో పునరావాస కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పునరావాస కేంద్రాలతో పాటు స్థానికంగా ఉండే పునరావాస కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే దివ్యాంగులైన చిన్నారుల మానసికోల్లాసానికి తోడ్పడేలా అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









