వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్
- September 11, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి 'వైఎస్సార్ ఆసరా' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో 'వైఎస్సార్ ఆసరా' ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. అలాగే పీ అండ్ జీ, హెచ్యూఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామని, పసిపిల్లల నుంచి బామ్మల వరకు అందరికీ ప్రయోజనాలు చేకూరేలా తాము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
అమ్మ ఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని ఆయన తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. అలాగే, హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం తాము వసతి దీవెన అమలు చేస్తున్నామని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ తాము త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







