జవాన్లందరికీ పోష్టికాహారం ఇవ్వాల్సిందే-రాహుల్ గాంధీ
- September 12, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశ సరిహద్దుల్లో ఎండనక ,వాననక నిరంతరం దేశ రక్షణకోసం శ్రమిస్తున్న జవాన్లందరికీ హోదాతో నిమిత్తం లేకుండా పౌష్టికాహారం ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రక్షణ శాఖపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, మన సైనికులకు తక్కువ స్థాయి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. సైనికాధికారులతో సమానంగా అందరికీ ఈ విధమైన ఫుడ్ అందజేయాలన్నారు. అధికారులకు ఒకలాగా, సాధారణ జవాన్లకు మరొకలా ఫుడ్ ఇవ్వడం వివక్ష చూపడమే అని రాహుల్ వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుత నిబంధనలను మళ్ళీ పరిశీలించాలని ఆయన సూచించారు.అసలే చైనాతో ‘తల బొప్పి కడుతున్న’ ఈ సమయంలో ఈ విధమైన పక్షపాతం చూపడం సహేతుకం కాదని రాహుల్ మరీ మరీ చెప్పారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు