ప్రభుత్వానికి భారీ మార్పులు: యుఏఈ ప్రైమ్ మినిస్టర్
- February 10, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యుఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఫెడరల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి భారీ మార్పులు చేయనున్నట్లు ట్విట్టర్లో ఫాలోవర్స్కి లైవ్ కన్వర్జేషన్ ద్వారా తెలిపారు. యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించి తన ఆలోచనల్ని, అలాగే నిర్మాణాత్మక మార్పుల గురించీ వివరించారు. యూఏఈలో అభివృద్ధిపైనా ఆయన తన ఆలోచనల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. హ్యాపీనెస్ మరియు టోలరెన్స్కి కొత్త క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్, అలాగే ఎడ్యుకేషన్ మరియు లేబర్ మినిస్ట్రీస్కి సంబంధించి మార్పులు చేర్పులు వంటివి చేపట్టనున్నామని ఆయన అన్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హ్యాపీనెస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ టోలరెన్స్ కొత్త మంత్రిత్వ శాఖలు రానున్నాయి. మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకే దాంట్లో కలపబడ్తాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పేరుని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్గా మార్చుతారు. క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మరియు వాటర్కి బదిలీ చేస్తారు, దాని పేరుని మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మరియు ఎన్విరాన్మెంట్గా మార్చుతారు. యూఏఈ యూత్ నేషనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. యూత్ ఎఫైర్స్కి ఈ కౌన్సిల్ సూచనలు చేస్తుంది. 22 ఏళ్ళ మహిళా మంత్రి ఈ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







