కువైట్ లో భారీ అగ్నిప్రమాదం..
- September 13, 2020
కువైట్ సిటీ:కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తన మంటలు చెలరేగటంతో దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందిని బరిలోకి దింపారు. అల్ సబా హెల్త్ జోన్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతం నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే..భవనంలోని కొన్ని ఫ్లోర్ లను గోడౌన్ లుగా వినియోగిస్తున్నారు. కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీగా సామాగ్రిని గోడౌన్ లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మంటల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని వెంటనే తగిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే..మంటల తీవ్రత ధాటికి ఘటనా స్థలంలో విపరీతమైన సెగలు వచ్చాయని, థర్మల్ కెమెరా 322 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వివరించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో 55 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







