కువైట్ లో భారీ అగ్నిప్రమాదం..
- September 13, 2020
కువైట్ సిటీ:కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తన మంటలు చెలరేగటంతో దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందిని బరిలోకి దింపారు. అల్ సబా హెల్త్ జోన్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతం నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే..భవనంలోని కొన్ని ఫ్లోర్ లను గోడౌన్ లుగా వినియోగిస్తున్నారు. కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీగా సామాగ్రిని గోడౌన్ లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మంటల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని వెంటనే తగిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే..మంటల తీవ్రత ధాటికి ఘటనా స్థలంలో విపరీతమైన సెగలు వచ్చాయని, థర్మల్ కెమెరా 322 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వివరించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో 55 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







