విమాన ప్రయాణాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఒమన్ ప్రభుత్వం
- September 13, 2020
మస్కట్:ఒమన్ కు వచ్చే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా ఆరోగ్య బీమా తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఒమన్ లో అడుగుపెట్టిన నాటి నుంచి కనీసం నెల రోజుల పాటైనా ఇన్సూరెన్స్ గడువు ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒమన్ పౌర విమానయాన అధికారులు ఈ మేరకు కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేశారు. ఒమన్ కు చేరుకోగానే ప్రతి ప్రయాణికుడు విధిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఈ 14 రోజులు ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ ధరించాల్సి ఉంటుంది. ఇక క్వారంటైన్ లో ఉండాల్సిన 14 రోజులకు సంబంధించి నివాస ఖర్చులను సదరు ప్రయాణికులే భరించాలి. అందుకు అనుగుణంగా హోటల్ బుకింగ్ వివరాలను కూడా తెలియజేయాలి. అలాగే సుల్తానేట్ కు వచ్చే ఒమనేతరులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఒమన్ నుంచి విదేశాలకు బయల్దేరే ప్రయాణికులకు సంబంధించి కూడా మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. విదేశీ ప్రయాణికుడికి ఒక్క సహాకుడిని మాత్రమే డిపార్చర్ టెర్మినల్ లోకి అనుమతిస్తారు. విమానం బయల్దేరే సమయానికి కనీసం మూడు, నాలుగు గంటల ముందే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని విమానాశ్రయంలోకి అనుమతించబోమని కూడా పౌర విమానయాన అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!