తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు
- September 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కు చేరింది. 24 గంటల్లో 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 974కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 34,427 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 21,69,339కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 264, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల్ 34, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్ 12, కామారెడ్డి 11, కరీంనగర్ 108, ఖమ్మం 37, కొమరం భీమ్ అసిఫాబాద్ 16, మహబూబ్ నగర్ 34, మహబూబాబాద్ 54, మంచిర్యాల్ 28, మెదక్ 13, మేడ్చల్ మల్కాజ్గిరి 25, ములుగు 9, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 47, నారాయణ్పేట్ 1, నిర్మల్ 8, నిజామాబాద్ 67, పెద్దంపల్లి 39, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107, సిద్ధిపేట్ 75, సూర్యాపేట 34, వికారాబాద్ 6, వనపర్తి 19, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ 70, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







