తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు

- September 14, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,417  కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కు చేరింది. 24 గంటల్లో 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 974కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,479 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 34,427 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 21,69,339కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల్‌ 34, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 11, కరీంనగర్‌ 108, ఖమ్మం 37, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 34, మహబూబాబాద్‌ 54, మంచిర్యాల్‌ 28, మెదక్‌ 13, మేడ్చల్ మల్కాజ్‌గిరి 25, ములుగు 9, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 47, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 8, నిజామాబాద్‌ 67, పెద్దంపల్లి 39, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107, సిద్ధిపేట్‌ 75, సూర్యాపేట 34, వికారాబాద్‌ 6, వనపర్తి  19, వరంగల్‌ రూరల్‌ 20, వరంగల్‌ అర్బన్‌ 70, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com