భారత్ లో కొత్తగా 92 వేలకు పైగా పాజిటివ్ కేసులు
- September 14, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కోరాన మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో నిత్యం 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 92 వేల 71 పాజిటివ్ కేసులు నమోదైనట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48 లక్షల 46 వేల 428కి చేరింది. ప్రస్తుతం 9 లక్షల 86 వేల 598 యాక్టివ్ కేసులు ఉండగా... 37 లక్షల 80 వేల 108 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో మరో 11 వందల 36 మంది వైరస్తో మరణించారు. ఇప్పటి వకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 79 వేల 722కి చేరింది. ఆదివారం ఒక్క రోజుల 9 లక్షల 78 వేల పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటి వరకు 5 కోట్ల 72 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్టు... ICMR తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







