24 మంది పార్లమెంట్ సభ్యులకు కరోనా పాజిటివ్..
- September 14, 2020న్యూ ఢిల్లీ:నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మొదటి రోజు సోమవారం లోక్సభ సభ్యులకు కోవిడ్ పరీక్ష నిర్వహించారు. అందులో 24 మంది సభ్యులు కరోనావైరస్ బారిన పడినట్లు తెలిసింది. వైరస్ బారిన పడిన 24 మందిలో మీనాక్షి లెఖీ, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ ఉన్నారు అని జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఆలస్యంగా మొదలైన సెషన్ యొక్క మొదటి రోజు, లోక్సభ సమావేశాలకు దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. 30 మందికి పైగా ప్రధాన గదికి పైన ఉన్న సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సభ్యుల మధ్య దూరాన్ని పాటించేందుకు వీలుగా ప్లాస్టిక్ తెరలను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆరుగురు సభ్యులకు వసతి కల్పించే బెంచీలకు కేవలం ముగ్గురు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. లోక్సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగగా, రాజ్యసభ మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు జరగనుంది. కొత్త సభ్యులు అజిత్ కుమార్, పూలో దేవి నీతమ్ ల చేత చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల