3.2 మిలియన్ దిర్హామ్ విలువైన ఫేక్ ప్రోడక్ట్స్ రీసైకిల్
- September 15, 2020దుబాయ్:దుబాయ్ కస్టమ్స్, 3.2 మిలియన్ దిర్హామ్ విలువైన కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ని 2020లో ఇప్పటిదాకా రీసైకిల్ చేయడం జరిగింది. 46 అంతర్జాతీయ బ్రాండ్స్కి సంబంధించి 148,700 ఫేక్స్ని రీసైకిల్ చేశారు. ధ్వంసం చేయడానికి బదులుగా వీటిని రీసైకిల్ చేయడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ యూసెఫ్ ఒజైర్ ముబారక్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ అలాగే యూఎస్ డిప్లమాటిక్ మిషన్స్తో జరిగిన వీడియో మీటింగ్ సందర్భభంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ విషయమై ఈ మీటింగ్లో చర్చ జరిగింది. అంతర్జాతీయ బ్రాండ్స్ హక్కుల విషయమై ఐపీఆర్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముబారక్ చెప్పారు. పూర్తిగా ఆయా ప్రోడక్ట్స్ని ధ్వంసం చేయడం కంటే వాటిని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రీసైకిల్ చేసేముందు ట్రేడ్ మార్క్ ఓనర్స్కి సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు