కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే ఇ-పేమెంట్‌ ప్రారంభం

- September 15, 2020 , by Maagulf
కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే ఇ-పేమెంట్‌ ప్రారంభం

సౌదీ అరేబియా:కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వేపై ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ నేటి నుంచి ప్రారంభమయ్యింది. ఇ-పేమెంట్‌ విధానం, కార్లు అలాగే ట్రక్కులు మరియో మోటర్‌ సైకిల్స్‌కి వర్తిస్తుందనీ, క్యాష్‌ రూపంలో చెల్లింపులు చేయకుండానే ఈ కాజ్‌వేని వినియోగించుకోవచ్చని కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే అథారిటీ పేర్కొంది. మెంబర్‌షిప్‌ కార్డులు కలిగినవారు కెఎఫ్‌సిఎ అధికారిక వెబ్‌సైట్‌లో రీచార్జ్‌ చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్స్‌ కూడా స్టాఫ్‌తో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కాగా, కొత్త గేట్‌ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుంది. ఆటోమేటిక్‌ వెయింగ్‌ కి సంబంధించి దీన్ని ఉపయోగించనున్నారు. మార్చి 7న ఈ 25 కిలోమీటర్ల కాజ్‌వే కరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, జులైలో ఈ కాజ్‌వేని తెరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com