కింగ్ ఫహాద్ కాజ్వే ఇ-పేమెంట్ ప్రారంభం
- September 15, 2020సౌదీ అరేబియా:కింగ్ ఫహాద్ కాజ్వేపై ఎలక్ట్రానిక్ పేమెంట్ నేటి నుంచి ప్రారంభమయ్యింది. ఇ-పేమెంట్ విధానం, కార్లు అలాగే ట్రక్కులు మరియో మోటర్ సైకిల్స్కి వర్తిస్తుందనీ, క్యాష్ రూపంలో చెల్లింపులు చేయకుండానే ఈ కాజ్వేని వినియోగించుకోవచ్చని కింగ్ ఫహాద్ కాజ్వే అథారిటీ పేర్కొంది. మెంబర్షిప్ కార్డులు కలిగినవారు కెఎఫ్సిఎ అధికారిక వెబ్సైట్లో రీచార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్స్ కూడా స్టాఫ్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. కాగా, కొత్త గేట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుంది. ఆటోమేటిక్ వెయింగ్ కి సంబంధించి దీన్ని ఉపయోగించనున్నారు. మార్చి 7న ఈ 25 కిలోమీటర్ల కాజ్వే కరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, జులైలో ఈ కాజ్వేని తెరిచారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు