బహ్రెయిన్:దోపిడికి పాల్పడిన అరగంటలో నిందితుల అరెస్ట్
- September 17, 2020మనామా:ఓ మహిళలను బెదిరించి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లిన కేసును కేవలం అరగంటలో చేధించారు బహ్రెయిన్ పోలీసులు. సీఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నడుచుకుంటు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆమె దగ్గరున్న బ్యాగును లాక్కొని పారిపోయారు. చోరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..కేవలం అరగంట వ్యవధిలో ఆ దొంగలు ఇద్దరిని గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దోపిడి పాల్పడిన ఇద్దరిలో ఒకరు 21 ఏళ్లు, మరొకరు 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణకు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్