సౌదీ:ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని GACA సూచన
- September 17, 2020రియాద్:ఇతర దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికులు, అదేవిధంగా సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలని పౌర విమానయాన సాధారణ విభాగం అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం నుంచి సౌదీలకు, ప్రవాసీయులకు మినహాయింపు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కింగ్డమ్ లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన మరుసటి రోజునే ప్రయాణికులకు జీఏసీఏ పలు సూచనలు చేసింది. కింగ్డమ్ లోకి ఎంటరైన ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపింది. సౌదీ చేరుకున్న 48 గంటల తర్వాత మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా తాము కోవిడ్ బారిన పడలేదని నిరూపించుకోవాలి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని, ప్రభుత్వ సూచనల విధిగా పాటించాలని అధికారులు కోరారు. అదేసమయంలో సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాలు ప్రకటించిన మార్గనిర్దేశకాల మేరకు అనుసరించాలని అన్నారు.
తాజా వార్తలు
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ