సౌదీ:ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని GACA సూచన
- September 17, 2020
రియాద్:ఇతర దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికులు, అదేవిధంగా సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలని పౌర విమానయాన సాధారణ విభాగం అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం నుంచి సౌదీలకు, ప్రవాసీయులకు మినహాయింపు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కింగ్డమ్ లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన మరుసటి రోజునే ప్రయాణికులకు జీఏసీఏ పలు సూచనలు చేసింది. కింగ్డమ్ లోకి ఎంటరైన ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపింది. సౌదీ చేరుకున్న 48 గంటల తర్వాత మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా తాము కోవిడ్ బారిన పడలేదని నిరూపించుకోవాలి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని, ప్రభుత్వ సూచనల విధిగా పాటించాలని అధికారులు కోరారు. అదేసమయంలో సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాలు ప్రకటించిన మార్గనిర్దేశకాల మేరకు అనుసరించాలని అన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







