70వ పడిలోకి అడుగు పెట్టిన భారత ప్రధాని మోదీ
- September 17, 2020
న్యూ ఢిల్లీ:భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో సేవా సప్తాహ్ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజును నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించారు.
70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సాధించ తలపెట్టిన లక్ష్యాలను వివరిస్తూ 70 వర్చువల్ కాన్ఫరెన్స్లను వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన 70 స్లైడ్స్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







