70వ పడిలోకి అడుగు పెట్టిన భారత ప్రధాని మోదీ
- September 17, 2020న్యూ ఢిల్లీ:భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో సేవా సప్తాహ్ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజును నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించారు.
70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సాధించ తలపెట్టిన లక్ష్యాలను వివరిస్తూ 70 వర్చువల్ కాన్ఫరెన్స్లను వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన 70 స్లైడ్స్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్