బహ్రెయిన్:దోపిడికి పాల్పడిన అరగంటలో నిందితుల అరెస్ట్

- September 17, 2020 , by Maagulf
బహ్రెయిన్:దోపిడికి పాల్పడిన అరగంటలో నిందితుల అరెస్ట్

మనామా:ఓ మహిళలను బెదిరించి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లిన కేసును కేవలం అరగంటలో చేధించారు బహ్రెయిన్ పోలీసులు. సీఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నడుచుకుంటు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆమె దగ్గరున్న బ్యాగును లాక్కొని పారిపోయారు. చోరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..కేవలం అరగంట వ్యవధిలో ఆ దొంగలు ఇద్దరిని గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దోపిడి పాల్పడిన ఇద్దరిలో ఒకరు 21 ఏళ్లు, మరొకరు 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణకు సిఫార్సు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com