బహ్రెయిన్:దోపిడికి పాల్పడిన అరగంటలో నిందితుల అరెస్ట్
- September 17, 2020మనామా:ఓ మహిళలను బెదిరించి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లిన కేసును కేవలం అరగంటలో చేధించారు బహ్రెయిన్ పోలీసులు. సీఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నడుచుకుంటు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆమె దగ్గరున్న బ్యాగును లాక్కొని పారిపోయారు. చోరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..కేవలం అరగంట వ్యవధిలో ఆ దొంగలు ఇద్దరిని గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దోపిడి పాల్పడిన ఇద్దరిలో ఒకరు 21 ఏళ్లు, మరొకరు 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణకు సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు