కరోనా ఫ్రంట్ లైనర్స్ కి 2 నెలల జీతం, మెడల్ ప్రకటించిన కువైట్
- September 17, 2020
కువైట్ సిటీ:కరోనా మహమ్మారి ప్రబలుతున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రణాలను రిస్క్ చేసి విధులు నిర్వహించిన కరోనా ఫ్రంట్ లైనర్స్ ప్రొత్సహాకాలు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. కువైట్ లోని అన్ని సెక్యూరిటీ విభాగాల ఉద్యోగులకు 2 నెలల జీతంతో మెడల్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్ధవంతంగా అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రంట్ లైనర్స్ సేవలను గుర్తించటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అంతర్గత వ్యవహారల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తన ప్రకటన వెల్లడించారు. కువైట్ ఆర్మీ, కువైట్ పోలీస్, నేషనల్ గార్డ్, కువైట్ ఫైర్ సర్వీస్ విభాగాల ఉద్యోగులు ప్రభుత్వ ప్రకటించిన ప్రొత్సహకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే...కరోనా సమయంలో సేవలు అందించిన తమ సిబ్బందికి మూడు నెలల జీతం ఇవ్వాలని అన్ని భద్రత విభాగాల అధిపతులు తొలుత కోరాయి. మెడల్ ద్వారా లభించే అలవెన్సులు అవసరం లేదని ప్రతిపాదించాయి. కానీ, మంత్రిత్వ శాఖ భద్రత సిబ్బందికి మెడల్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. దీంతో ఆయా భద్రతా విభాగాల్లోని సిబ్బందికి రెండు నెలల పూర్తి వేతనం(ఎలాంటి కోతలు లేకుండా) నెలకు 75KD మెడల్ అలవెన్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా పై హూతీల దాడులు: 73 మంది పౌరులకు గాయాలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్







