ఇంటర్నేషనల్ ఎరైవల్స్కి కోవిడ్ 19 ట్రాకింగ్ డివైజ్ తప్పనిసరి
- September 18, 2020
అబుధాబి:అబుధాబి ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్, కరోనా వైరస్ ట్రాకింగ్ డివైజ్ని తప్పక ధరించాలని, 14 రోజుల మాండేటరీ క్వారంటైన్ని పూర్తి చేయాలని ఎతిహాద్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. కాగా, యూఏఈలో ఇటీవల డెయిలీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్న దరిమిలా అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడమే కరోనా వ్యాప్తికి కారణమని అధికారులు అంటున్నారు.అబుధాబి ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, 14 రోజుల హోం క్వారంటైన్ని విధిస్తున్నారు. గడచిన రెండు వారాల్లో నమోదైన కేసుల్లో 88 శాతం కేసులు గేదరింగ్స్ వల్ల వచ్చినవేననీ, వీటిల్లో 12 శాతం కేసులు అంతర్జాతీయ ప్రయాణికులకి సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటిదాకా యూఏఈలో 82,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మంది ప్రాణాలు కోల్పోయారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







