భారత్ లో 10లక్షలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- September 19, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 53,08,015కు చేరాయి. అయితే, ఇందులో 42,08,432 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 10,13,964 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో నమోదవుతున్న కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో కరోనా కాటుకి బలై 1247 మంది మరణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 85,619కు పెరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు