యూఏఈ:వాతావరణ మార్పులపై ఎన్సీఎం సూచనలు
- September 19, 2020
యూఏఈ:ఇవాళ, రేపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం 9గంటల వరకు మంచు దట్టంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని...మంచు దుప్పటి కారణంగా దృశ్య దూరం తగ్గుతుందని వెల్లడించింది. ఉదయం వెళలో మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు దూరంగా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే పగలు ఎండ తీవ్రత ఎప్పటిలాగే కొనసాగుతుందని..గరిష్టంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని జాతీయ వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







