ఇక కార్మికుల కాంట్రాక్టులన్ని ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయాలని ప్రైవేట్ సంస్థలకు ఒమన్ ఆదేశం
- September 19, 2020
మస్కట్:ప్రవైట్ రంగంలో సంస్థ యాజమాన్యం, కార్మికుడి మధ్య కుదర్చుకునే వర్క్ కాంట్రాక్టులను ఆన్ లైన్ రిజిస్టర్ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు..తమ కార్మికులతో కుదర్చుకునే పని ఒప్పందాలను మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యం ముందుగా పని ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసి సదరు కార్మికుడికి నోటిఫికేషన్ పంపిస్తారు. ఆ ఒప్పందంలోని అంశాలను బట్టి సదరు కార్మికుడు ఒప్పందాన్ని అంగీకరించవచ్చు...లేదంటే తిరస్కరించవచ్చు. అయితే..వర్క్ కాంట్రాక్టులో కార్మికుడికి ఇచ్చే జీతం, ఇతర అలవెన్సుల విషయంలో మంత్రిత్వ శాఖ జోక్యం ఉండదు. అది పూర్తిగా కంపెనీ యాజమాన్యం, కార్మికుడి మధ్య పరస్పర అవగాహన మేరకే ఒప్పందం జరుగుతుంది. అయితే..కార్మిక చట్టంలోని కనీస వేతనం నిబంధనలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ తమ
ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా జాతీయ కార్మికశక్తిని మెరుగు పరిచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జాతీయ ఆర్ధిక స్థిరత్వానికి శ్రామిక శక్తిని మరింత ఉత్తేజితం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. కార్మిక చట్టాలు, నియంత్రణ విధానాలను పునసమీక్షించటం ద్వారా లేబర్ మార్కెట్ పునరుత్తేజం తీసుకురావటమే తమ లక్ష్యమని వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







