ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో అరుదైన రికార్డు..

- September 20, 2020 , by Maagulf
ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో అరుదైన రికార్డు..

దుబాయ్:ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియం లో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 20వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 30 రన్స్ చేయడం జరిగింది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఇన్ని రన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. 

ఢిల్లీ బాట్స్‌మెన్‌ స్టోయినిస్‌ 20వ ఓవర్ మొదటి బాల్‌కు 6 కొట్టగా.. ఆ తర్వాత వైడ్.. నెక్స్ట్ మూడు బంతుల్లో 3 ఫోర్లు బాదాడు. 5వ బంతిని సిక్స్‌గా మలిచిన స్టోయినిస్‌.. 6వ బంతికి రన్ తీస్తూ రనౌట్ అయ్యాడు. అయితే అది నోబాల్ కావడంతో ఢిల్లీ ఖాతాలోకి ఒక పరుగు వచ్చింది. ఇక చివరి బంతికి నార్టే 3 రన్స్ తీయడంతో 20 ఓవర్లో 30 రన్స్ వచ్చాయి. దీనితో ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్‌లో 30 రన్స్ తీసిన తొలి జట్టుగా ఢిల్లీ నిలవడమే కాకుండా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com