8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెండ్
- September 21, 2020
న్యూ ఢిల్లీ:పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల సస్పెన్షన్ తీర్మానానికి రాజ్యసభ డిప్యూటి చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు నిన్న తీవ్ర్ స్థాయిలో ఆందోళన చేసాయి. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా బిల్లు ప్రతులను ఎంపీలు చించి వేసారు.
దీనితో ఈ సెషన్ పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు నిన్న నిరసన తెలిపి హడావుడి చేసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల తీరుపై వెంకయ్య సభలోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. బిజెపి ఎంపీలు ఈ తీర్మానం ప్రవేశ పెట్టగ దానికి చైర్మన్ ఆమోద ముద్ర వేసారు. నిన్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







