కువైట్లోని ఇంజనీర్లకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- September 21, 2020
కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఇంజనీర్లకు అక్కడి భారత దౌత్యకార్యాలయం కీలక సూచన చేసింది. ప్రస్తుతం ఎంబసీ నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్లో భాగంగా అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో పాటు మిగతా ఇంజనీర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గత వారం భారత ఎంబసీ ఇండియన్ ఇంజనీర్ల కోసం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో https://forms.gle/YRoQwFEu3YHURgCe6 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఎంబసీ పేర్కొంది. కనుక ఇండియన్ ఇంజనీర్స్ వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని భారత దౌత్యకార్యాలయం ఆదివారం మరోసారి గుర్తు చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







