కువైట్లోని ఇంజనీర్లకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- September 21, 2020
కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఇంజనీర్లకు అక్కడి భారత దౌత్యకార్యాలయం కీలక సూచన చేసింది. ప్రస్తుతం ఎంబసీ నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్లో భాగంగా అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో పాటు మిగతా ఇంజనీర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గత వారం భారత ఎంబసీ ఇండియన్ ఇంజనీర్ల కోసం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో https://forms.gle/YRoQwFEu3YHURgCe6 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఎంబసీ పేర్కొంది. కనుక ఇండియన్ ఇంజనీర్స్ వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని భారత దౌత్యకార్యాలయం ఆదివారం మరోసారి గుర్తు చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!