భారత్‌లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో..

- September 23, 2020 , by Maagulf
భారత్‌లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో..

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో... 9 లక్షల 53 వేల 683 పరీక్షలు నిర్వహించగా... 83 వేల 347 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56 లక్షల 46 వేల 11కి చేరినట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 68 వేల 377 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజులో కరోనా నుంచి 89 వేల 746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల 87 వేల 613 మంది రికవర్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో ఒక వెయ్యి 85 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 90 వేలు దాటింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com