భారతీయులకు 16 దేశాలు వీసాలు అవసరం లేదు
- September 23, 2020న్యూ ఢిల్లీ:భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది. ఎలాంటి వీసా అనుమతి లేకుండానే తమ దేశం రావచ్చని పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో భూటాన్,నేపాల్,మాల్దీవ్స్, మారిషస్, నియు ద్వీపం,డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ విన్సెంట్,సెర్బియా,గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్,హైతి,హొంగ్ కాంగ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి.
వీటితో పాటు సాధారణ వీసా కలిగిన భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వీటిలో మయన్మార్, ఇరాన్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. మలేసియా,శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?