'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

- September 24, 2020 , by Maagulf
\'గిఫ్ట్‌ ఏ స్మైల్‌\' అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్:తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన “గిఫ్ట్‌ ఏ స్మైల్‌” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్అం దించిన రెండు అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆంబులెన్స్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ , మున్సిపల్ శాఖామంత్రి  కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒక ఆంబులెన్స్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి మండల ప్రజలకు అందుబాటులో ఉండనుండగా.. మరొక్క ఆంబులెన్స్ కోటపల్లి, చెన్నూర్(మండల & పట్టణం), భీమారం, జైపూర్ మండలాల ప్రజలకు సేవలు అందించనుంది. అత్యంత అధునాతనమైన ఈ ఆంబులెన్స్ లో ఆక్సిజెన్, వెంటిలేటర్ల సదుపాయం కూడా ఉంది. కోవిడ్ మరియు ప్రజా అవసరాల రిత్యా బాల్క సుమన్ రెండు ఆంబులెన్స్ అందించడం పట్ల కేటీఆర్ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూర్ ప్రజలకు రెండు అధునాతన ఆంబులెన్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించడానికి దోహదపడనున్నాయి. రెండు అంబులెన్స్ అందించి తన దాతృత్వాన్ని చాటిన ఎమ్మెల్యే బాల్క సుమన్ పై చెన్నూర్ నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com