బహ్రెయిన్:ఫేస్ మాస్క్ లేకుంటే స్పాట్ లోనే ఫైన్..
- September 24, 2020మనామా:ఇక నుంచి బహ్రెయిన్ లో పర్యటించే ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఆన్ ది స్పాట్ 20 దినార్ల జరిమానా చెల్లించాలి. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్ లోని పబ్లిక్ ప్లేసులు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఇలా బహిరంగ ప్రాంతాల్లో ప్రతీ చోట ఫేస్ మాస్కులుs ఖచ్చితంగా ధరించాలని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ఫేస్ మాస్క్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా మాస్క్ ధరించకుండా కనిపిస్తే అక్కడి జ్యూడిషియల్ అఫీసర్ 20 దినార్ల ఫైన్ విధించి, అక్కడికక్కడే ఫైన్ వసూలు చేస్తారు. నిబంధనల ఉల్లంఘించినట్లు రికార్డ్ చేసుకొని ఫైన్ చెల్లించినట్లు రశీదు కూడా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఫైన్ చెల్లించేందుకు నిరాకరించినా, ఫైన్ చెల్లించలేకపోయినా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలిస్తారు. కరోనా నిబంధనల అమలు, ఫైన్ విధింపు విధులను జ్యూడిషియల్ అధికారులే కాకుండా పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహించే సిబ్బంది కూడా ఫైన్ విధించేలా అధికారులను ఇచ్చారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ