బహ్రెయిన్:ఫేస్ మాస్క్ లేకుంటే స్పాట్ లోనే ఫైన్..
- September 24, 2020
మనామా:ఇక నుంచి బహ్రెయిన్ లో పర్యటించే ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఆన్ ది స్పాట్ 20 దినార్ల జరిమానా చెల్లించాలి. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్ లోని పబ్లిక్ ప్లేసులు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఇలా బహిరంగ ప్రాంతాల్లో ప్రతీ చోట ఫేస్ మాస్కులుs ఖచ్చితంగా ధరించాలని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ఫేస్ మాస్క్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా మాస్క్ ధరించకుండా కనిపిస్తే అక్కడి జ్యూడిషియల్ అఫీసర్ 20 దినార్ల ఫైన్ విధించి, అక్కడికక్కడే ఫైన్ వసూలు చేస్తారు. నిబంధనల ఉల్లంఘించినట్లు రికార్డ్ చేసుకొని ఫైన్ చెల్లించినట్లు రశీదు కూడా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఫైన్ చెల్లించేందుకు నిరాకరించినా, ఫైన్ చెల్లించలేకపోయినా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలిస్తారు. కరోనా నిబంధనల అమలు, ఫైన్ విధింపు విధులను జ్యూడిషియల్ అధికారులే కాకుండా పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహించే సిబ్బంది కూడా ఫైన్ విధించేలా అధికారులను ఇచ్చారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







