గూగుల్‌ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ మీటింగ్..

- September 24, 2020 , by Maagulf
గూగుల్‌ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ మీటింగ్..

హైదరాబాద్:సోషల్‌ మీడియా దిగ్గజం గూగుల్‌ ప్రతినిధులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.సైబర్‌ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్‌ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. వివిధ గూగుల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ నేరాలు విషయమై గూగుల్ టెక్నికల్ టీమ్ పోలీసులకు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునితా మొహంటీ, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com