బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది..

- February 11, 2016 , by Maagulf
బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది..

 పెళ్లిళ్ల సీజన్‌, ప్రపంచ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. 19నెలల గరిష్ఠానికి నేడు పసిడి ధర చేరింది. గురువారం బంగారం ధర రూ.215 పెరగడంతో.. పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.28,800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,214.64 డాలర్లుగా ఉంది. మరోపక్క వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.130 తగ్గి కేజీ వెండి ధర రూ.37,100కి చేరింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో దీని ధరపై ప్రభావం చూపిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com