వృత్తికే వన్నె తెచ్చిన కర్తవ్యం...
- September 26, 2020మచిలీపట్నం:జోరువానలో వృత్తి ధర్మాన్ని నిర్వహించిన కానిస్టేబుల్ -982.D. శ్రీనివాసును సత్కరించిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు.
హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద నిరంతరం వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది.అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి స్తంభించిపోయే అవకాశం ఉన్న ప్రాంతం.
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్- 982 డి.శ్రీనివాసు 25.09.2020 వ తేదీ సాయంత్రం జంక్షన్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో, అనుకోకుండా ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో, ఏమాత్రం వెను తిరగకుండా జోరు వానలో తడుస్తూనే వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాడు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువాన, క్షణం ఆలస్యం చేస్తే భారీగా నిలిచిపోయే ట్రాఫిక్, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధినిర్వహణలో నిమగ్నమై కానిస్టేబుల్ చూపిన చొరవ కు, రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత, రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సామాజిక మాధ్యమం వేదికగా కానిస్టేబుల్ యొక్క సేవకు అభినందనలు తెలుపగా, ఈరోజు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయం లో దుశ్శాలువతో సత్కరించి తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు