బాల సుబ్రహ్మణ్యం మరణం మాకు తీరని లోటు - టీమ్ ఆదిత్య మ్యూజిక్
- September 26, 2020
హైదరాబాద్ :గాన గంధర్వడు ప్రముఖ గాయకలు బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1 గం 4 నిలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేశ్ గుప్త, మాట్లాడుతూ, బాలుగారు ఇక లేరనే వార్త మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ సిబ్బందితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సంగీత అభిమానుల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. దాదాపు 50 ఏళ్లుగా సంగీత ప్రపంచానికి ఆయన అందించి సేవలు అనితర సాధ్యం. తెలుగులో ఆయన పాడిన పాటల్లో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసే అదృష్టం దక్కింది. అటు సినిమా పాటలు పాడుతూనే ఇటు భక్తిరస పాటలు కూడా ఆలపించేవారు బాలు. అలా ఆయన పాడిన భక్తి రస పాటల్లో మా సంస్థ ద్వారా విడుదల చేసిన హనుమాన్ చాలీసా, శివోహం వంటి మొదలగు పాటలు విశేష ఆదరణ సంపాదించుకున్నాయి. మూడు దశాబ్ధలు నుంచి బాలుగారుతో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్రయాణం కొనసాగుతోంది. ఆయన మరణం మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్ధకు తీరని లోటుగా భావిస్తున్నాము. అయితే బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అద్భుతమైన గాత్రం ద్వారా మనందరితోనే ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనఃస్పూర్తిగా ఆ దేవుడుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







