వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం...
- September 27, 2020న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈబిల్లులు చట్టబద్దం అయ్యాయి. ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్నా రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం విశేషం. జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. కాగా, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు బిల్లులను ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుపై రాజ్యసభలో పెద్ద రగడ జరిగింది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని కేంద్రం చెప్తున్నది. అయితే, ఈ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు