820 వాహనాలను స్వాధీనం చేసుకున్న రాస్ ఆల్ ఖైమా పోలీసులు
- September 27, 2020
రాస్ ఆల్ ఖైమా:రోడ్ల పక్కన, గ్యారేజ్ లు, ఇతర ప్రాంతాల్లో చాలా కాలంగా వదలేసిన వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మే నుంచి మొత్తం 820 వాహనాలను జప్తు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిర్వహణ లేకుండా వదిలేసిన వాహనాలు దుమ్ము, ధూళితో అధ్వాన్నంగా మారి సిటీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాంటి వాహనాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించిన పోలీసులు..ఇప్పటికే ఆయా వాహనాల ఒనర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. పది రోజుల్లో వాహనాలను అక్కడి నుంచి తీసేయాలని గడువు ఇచ్చారు. నిర్దేశించిన గడువులోగా తీసుకుపోని వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక నెంబర్ ప్లేట్లు లేకుండా వదిలేసిన వాహనాల విషయంలో నోటీసులు కూడా ఇవ్వబోమని..ఆ మరుక్షణమే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన వాహనాలు, దుమ్ము పట్టి అధ్వాన్నంగా ఉన్న వాహనాలు, నడవటానికి వీల్లేని వాహనాల విషయంలోనూ నోటీసులు ఇవ్వబోమని...వెంటనే సీజ్ చేస్తామని స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..