బహ్రెయిన్:ప్రవాసీయులు ఉండే ఇళ్ల పరిస్థితి, కోవిడ్ జాగ్రత్త చర్యలను పరిశీలించిన అధికారులు

- September 28, 2020 , by Maagulf
బహ్రెయిన్:ప్రవాసీయులు ఉండే ఇళ్ల పరిస్థితి, కోవిడ్ జాగ్రత్త చర్యలను పరిశీలించిన అధికారులు

మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలతో పాటు విదేశీ కార్మికుల భద్రతను పరిశీలించేందుకు మనామాలోని ఉత్తర ప్రాంతంలో నార్తర్న్ గవర్నరేట్ గవర్నర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రవాస కార్మికులు ఉంటున్న ఇళ్లను వాటి స్థితిగతులను పరిశీలించారు. కార్మికుల భద్రతకు అనుగుణంగా ఇళ్లు ఉన్నాయో లేదోనని తనిఖీ చేశారు. అలాగే కార్మికులు కరోనా బారిన పడుకుండా అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వసతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలను కూడా పరిశీలించారు. అద్దె కోసం ఇరుకు గదుల్లో పరిమితికి మంచి ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించవద్దని, కరోనా నేపథ్యంలో పరిమితికి మించి ఒకే గదిలో ఎక్కువ మంది ఉన్నా అది చట్ట విరుద్ధమని గవర్నర్ హెచ్చరించారు. భౌతిక దూరం పాటించేలా గదుల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిమిత సంఖ్యలో ఉండాలన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com