బహ్రెయిన్:ప్రవాసీయులు ఉండే ఇళ్ల పరిస్థితి, కోవిడ్ జాగ్రత్త చర్యలను పరిశీలించిన అధికారులు
- September 28, 2020
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలతో పాటు విదేశీ కార్మికుల భద్రతను పరిశీలించేందుకు మనామాలోని ఉత్తర ప్రాంతంలో నార్తర్న్ గవర్నరేట్ గవర్నర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రవాస కార్మికులు ఉంటున్న ఇళ్లను వాటి స్థితిగతులను పరిశీలించారు. కార్మికుల భద్రతకు అనుగుణంగా ఇళ్లు ఉన్నాయో లేదోనని తనిఖీ చేశారు. అలాగే కార్మికులు కరోనా బారిన పడుకుండా అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వసతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలను కూడా పరిశీలించారు. అద్దె కోసం ఇరుకు గదుల్లో పరిమితికి మంచి ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించవద్దని, కరోనా నేపథ్యంలో పరిమితికి మించి ఒకే గదిలో ఎక్కువ మంది ఉన్నా అది చట్ట విరుద్ధమని గవర్నర్ హెచ్చరించారు. భౌతిక దూరం పాటించేలా గదుల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిమిత సంఖ్యలో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







