ఏపీలో కొత్తగా 6,133 కరోనా పాజిటివ్ కేసులు
- September 30, 2020
అమరావతి:ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్ను పరీక్షించగా 6,133 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఇందులో 58,445 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,29,211 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 48 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,828కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 58.06 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.
నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున.. కడపలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 655 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు