అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల..

- September 30, 2020 , by Maagulf
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల..

న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది.అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే దశలవారీగా పలు మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని సడలింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇక మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్కానింగ్, శానిటైజర్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలలో కూడా ఇలాంటి నిబంధనలు తప్పనిసరని తెలిపింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com